కుప్పంలో దొంగ ఓట్లపై స్పందించిన వైసీపీ నేత భరత్
ABN , First Publish Date - 2021-11-15T18:43:00+05:30 IST
చిత్తూరు: కుప్పంలో అధికార పార్టీ వైసీపీ బరితెగిస్తోంది. వైసీపీ దొంగ ఓటర్లు చొరబడుతున్నారు.
చిత్తూరు: కుప్పంలో అధికార పార్టీ వైసీపీ బరితెగిస్తోంది. వైసీపీ దొంగ ఓటర్లు చొరబడుతున్నారు. దొంగ ఓటర్లను టీడీపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన వైసీపీ నేత భరత్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ పోలీసులు వారి బాధ్యతలు నిర్వహిస్తున్నారని, ఎవరిపై అనవసరంగా కేసులు పెట్టడంలేదని చెప్పారు. దౌర్జన్యం చేస్తున్నవాళ్లు, రౌడీ షీటర్లను మాత్రమే అదుపులోకి తీసుకుంటున్నారని తెలిపారు. కుప్పంలో బయట నుంచి ఎవరూ రాలేదని, దొంగ ఓటింగ్ జరగడంలేదని అన్నారు. దానికి సంబంధించిన ఆధారాలు ఉంటే తనకు ఇవ్వాలన్నారు. బయట నుంచి వచ్చిన వారు వెళ్లిపోయారన్నారు. ఇక్కడ దొంగ ఓటర్లు ఎవరూ లేరని, ప్రజాస్వామ్యయుతంగానే ఓటింగ్ జరుగుతోందని భరత్ పేర్కొన్నారు.