వైసీపీలో బయటపడిన వర్గ విభేదాలు

ABN , First Publish Date - 2020-05-23T20:58:04+05:30 IST

ల్లాలో ఉండి వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. వివరాల్లోకెళితే.. వైసీపీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఉండి సెంటర్లో వృద్ధులకు పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు.

వైసీపీలో బయటపడిన వర్గ విభేదాలు

పశ్చిమగోదావరి: జిల్లాలో ఉండి వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. వివరాల్లోకెళితే.. వైసీపీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఉండి సెంటర్లో వృద్ధులకు పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అయితే ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది. ఒకరిపై ఒకరు దూసుకువచ్చారు. వెంటనే కల్పించుకున్న పోలీసులు ఇరు వర్గాలను పంపించేశారు. అయితే పండ్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఏ ఒక్క వైసీపీ నాయకుడు కూడా కనీస నిబంధనలు పాటించలేదు. భౌతిక దూరాన్ని ఎవరూ అనుసరించలేదు.

Updated Date - 2020-05-23T20:58:04+05:30 IST