ఉద్యోగులను నష్టపరుచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు: Srikanth reddy

ABN , First Publish Date - 2022-01-20T18:06:57+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగులను బానిసలుగా చూసిన, కించిపరిచిన వారిని గత ప్రభుత్వంలో చూశామని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

ఉద్యోగులను నష్టపరుచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు: Srikanth reddy

అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులను బానిసలుగా చూసిన, కించిపరిచిన వారిని గత ప్రభుత్వంలో చూశామని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బహిరంగ వేదికలపై ప్రభుత్వ ఉద్యోగులను అవమానించిన పరిస్థితి గతంలో ఉందన్నారు. కరోనాతో ఆర్థిక పరిస్థితులు దిగజారినా ఉద్యోగులు అడగకపోయినా సీఎం  27 శాతం ఐఆర్ ఇచ్చారని గుర్తు చేశారు. ఐఆర్ ఇచ్చి ఉండకపోయి ఉంటే ప్రభుత్వంపై 18 వేల కోట్ల భారం పడి ఉండేది కాదని తెలిపారు. ఐఆర్ ఇవ్వకుండా ఉంటే  పెండింగ్‌లో ఉన్న చిన్నకాంట్రాక్టుల బిల్లులన్నింటినీ ప్రభుత్వం చెల్లించి ఉండేదని ఆయన చెప్పారు.


ఉద్యోగులను నష్టపరుచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ద్వేషించే వారి ట్రాప్‌లో ఉద్యోగులు పడవద్దన్నారు. హెచ్ఆర్ఏపై ప్రభుత్వం పునరాలోచన చేస్తోందన్నారు. ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందని తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్నారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకీ ప్రభుత్వం  వేతనాలు పెంచిందని అన్నారు. ప్రభుత్వం ఎప్పుడూ మొండిగా పోదని... ఉద్యోగులు అందరికీ న్యాయం జరుగుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ పేర్కొన్నారు.


పదివేల కోట్ల భారం పడుతున్నా ప్రభుత్వం 23 శాతం ఫిట్ మెంట్ ఇచ్చిందన్నారు. ఉద్యోగులు పీఆర్సీపై తెలంగాణతో పోల్చి చూసుకోవాలని... పక్క రాష్ట్రాల్లో ఎక్కడా ఇంత పీఆర్సీ లేదని అన్నారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం  పునరాలోచన చేస్తోందని తెలిపారు. తమ వైపు నుంచే కాకుండా ప్రభుత్వం వైపు నుంచి కూడా ఉద్యోగులు చూడాలన్నారు. ఉద్యోగులు ఏకపక్షంగా రాజకీయ పార్టీల్లాగా ఆలోచించవద్దని అన్నారు. ఉద్యోగులను మోసం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని, ఉద్యోగులను చర్చలకు పిలిచి పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. 

Updated Date - 2022-01-20T18:06:57+05:30 IST