వాలంటీర్‌పై వైసీపీ నేత బెదిరింపులు

ABN , First Publish Date - 2020-06-04T23:07:09+05:30 IST

వాలంటీర్లపై వైసీపీ నేతల బెదిరింపులపర్వం కొనసాగుతోంది.

వాలంటీర్‌పై వైసీపీ నేత బెదిరింపులు

కడప జిల్లా: వాలంటీర్లపై వైసీపీ నేతల బెదిరింపులపర్వం కొనసాగుతోంది. తాజాగా కడప జిల్లా జమ్మలమడుగులో 17, 18 వార్డు సచివాలయంలో వాలంటీర్‌పై వైసీపీ నాయకుడు బెదిరింపులకు దిగారు. నేతన్న హస్తం పథకంలో అనర్హులను అర్హులుగా ప్రకటించాలంటూ వాలంటీర్లు, వెల్ఫేర్ అధికారులపై స్థానిక వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి ఒత్తిడి తీసుకువచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా చేస్తే తమ ఉద్యోగాలే పోతాయంటూ వారు చెప్పడంతో వాలంటీర్, వెల్ఫేర్ ఆఫీసర్‌పై  వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి గొడవకు దిగారు. నేతన్న హస్తం అర్హుల జాబిత తనకు చూపించాలంటూ డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు చెప్పినట్లుగా వాలంటీర్లు నడుచుకోవాలని, అసలు నీకు ఉద్యోగం ఎలా వచ్చిందో తెలుసా అంటూ బెదిరించారు.

Updated Date - 2020-06-04T23:07:09+05:30 IST