వైసీపీ విజయోత్సవాల్లో వలంటీర్లు
ABN , First Publish Date - 2020-05-24T09:00:20+05:30 IST
మండల కేంద్రంలో శనివారం వైసీపీ నాయకులు నిర్వహించిన విజయోత్సవ కా ర్యక్రమంలో గ్రామ వలంటీర్లు సందడి చేశారు.
వజ్రకరూరు,మే23: మండల కేంద్రంలో శనివారం వైసీపీ నాయకులు నిర్వహించిన విజయోత్సవ కా ర్యక్రమంలో గ్రామ వలంటీర్లు సందడి చేశారు. ప్ర భుత్వం తరపున పనిచేసే వలంటీర్లు రాజకీయ కార్యక్రమంలో పాల్గొనడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావడంతో వైసీపీ శ్రేణులు మండల కేంద్రంలోని వైఎ్సఆర్ విగ్రహం వద్ద సంబరాలు చేసుకున్నారు. ఈ పార్టీ కార్యక్రమానికి గ్రామానికి చెందిన గ్రామ వలంటీర్లు దాదాఖలందర్, వినోద్ కుమార్, మహబుబ్బాషలు పాల్గొన్నారు. నిబంధనల ప్రకా రం ప్రభుత్వం నుంచి ఆదాయం పొందేవారు ఎటువంటి రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొనరాదు. వలంటీర్లపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారా? లేక నేతల ఒత్తిడికి తలొగ్గుతారో వేచి చూ డాలి మరి.