వైసీపీ నేతలు నాకు శత్రువులు కాదు: పవన్‌

ABN , First Publish Date - 2021-10-03T02:18:23+05:30 IST

పోలీసులు, ఉన్నతాధికారులకు జనసేన అధినేత సెల్యూట్ చేశారు. అనంతపురం జిల్లా కొత్త చెరువుల్లో అక్టోబరు

వైసీపీ నేతలు నాకు శత్రువులు కాదు: పవన్‌

అనంతపురం: పోలీసులు, ఉన్నతాధికారులకు జనసేన అధినేత సెల్యూట్ చేశారు. అనంతపురం జిల్లా కొత్త చెరువుల్లో అక్టోబరు 2న శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసు కానిస్టేబుల్ కొడుకుగా తనకు కష్టం విలువ తెలుసని చెప్పారు. పదవులు ఆశించి రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి రాజకీయాల్లోకి వచ్చానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు నాకు శత్రువులు కాదన్నారు. అధికార యంత్రాంగం.. పాలన సరిగాలేదని విమర్శించారు. రాయలసీమ యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమకు వచ్చే పారిశ్రామికవేత్తలను భయపెడితే ఎవరు వస్తారు? ప్రశ్నించారు. నాయకుడు అవినీతితో నిండిపోతే పేదలకు సంక్షేమ పథకాలు ఎలా అందుతాయని నిలదీశారు. ఏ కులానికి తాను వ్యతిరేకిని కాదని, అన్ని వర్గాలు బాగుండాలని పవన్‌కల్యాణ్ ఆకాంక్షించారు.

Updated Date - 2021-10-03T02:18:23+05:30 IST