చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతల దాడిని ఖండిస్తున్నాం: కొల్లు రవీంద్ర

ABN , First Publish Date - 2021-09-17T21:16:37+05:30 IST

మాజీసీఎం చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతల దాడిని ఖండిస్తున్నామని టీడీపీ నేత కొల్లు రవీంద్ర ప్రకటించారు.

చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతల దాడిని ఖండిస్తున్నాం: కొల్లు  రవీంద్ర

అమరావతి: మాజీసీఎం చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతల దాడిని ఖండిస్తున్నామని టీడీపీ నేత కొల్లు  రవీంద్ర ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ శ్రేణులపై వైసీపీ గూండాలు విచక్షణారహితంగా దాడి చేశారని మండపడ్డారు. చంద్రబాబు ఇంటిపై ఎమ్మెల్యే జోగి రమేష్ దాడికి వస్తే పోలీసులు వత్తాసు పలుకుతున్నారని, డీజీపీకి తెలియకుండానే జోగి రమేష్ చంద్రబాబు నివాసానికి వచ్చారా? అని ప్రశ్నించారు. జోగి రమేష్‌ను అరెస్ట్ చేయకుండా టీడీపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేయడం దారుణమన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఉందో లేదో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రంలో 10 లక్షల పెన్షన్లు తొలగించారని ఆరోపించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే దిగజారుడు రాజకీయం చేస్తున్నారని కొల్లు రవీంద్ర దుయ్యబట్టారు.


Updated Date - 2021-09-17T21:16:37+05:30 IST