గుడివాడలో వైసీపీ నేతలు జూదాలు, కేసినో నిర్వహించారు: వర్ల
ABN , First Publish Date - 2022-01-22T21:18:59+05:30 IST
గుడివాడలో వైసీపీ నేతలు జూదాలు, కేసినో నిర్వహించారని టీడీపీ నేత వర్ల రామయ్య తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
అమరావతి: గుడివాడలో వైసీపీ నేతలు జూదాలు, కేసినో నిర్వహించారని టీడీపీ నేత వర్ల రామయ్య తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలోనే కేసినో నిర్వహించారని చెప్పారు. కేసినో వ్యవహారంపై సీఎం జగన్రెడ్డి స్పందించడం లేదని తప్పుబట్టారు. గుడివాడలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ రౌడీలు దాడి చేస్తున్నా.. పోలీసులు భద్రత కల్పించలేకపోయారని మండిపడ్డారు. ఘటనపై డీఐజీ స్పందించడం లేదని, సంప్రదించినా సమాధానం లేదని వర్ల రామయ్య పేర్కొన్నారు.
‘‘ఏపీని వైసీపీ నేతలు భ్రష్టుపట్టిస్తున్నారు. గుడివాడలో కేసినో నిర్వహిస్తున్నా పోలీసులకు తెలియదట. పోలీసుల సమక్షంలోనే టీడీపీ నేతలపై వైసీపీ రౌడీమూకలు దాడి చేశారు’’ అని టీడీపీ నేత కొల్లు రవీంద్ర మండిపడ్డారు.