కరోనాతో ప్రజలు చస్తుంటే ఎంజాయ్ చేస్తున్న వైసీపీ లీడర్లు

ABN , First Publish Date - 2021-05-11T20:21:09+05:30 IST

రాష్ట్రంలో కరోనా స్వైర విహారం చేస్తోంది. రాజధాని అమరావతితోపాటు అన్ని జిల్లాల్లో కరోనా...

కరోనాతో ప్రజలు చస్తుంటే ఎంజాయ్ చేస్తున్న వైసీపీ లీడర్లు

కడప: రాష్ట్రంలో కరోనా స్వైర విహారం చేస్తోంది. రాజధాని అమరావతితోపాటు అన్ని జిల్లాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా దెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఆక్సిజన్ అందక కొందరు, బెడ్స్ దొరక్కా మరి కొందరు కళ్లముందే చనిపోతున్నారు. ఇలాంటి విపత్కార పరిస్థితుల్లో ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కరోనా బాధితులకు అండగా ఉంటూ.. వారికి మేమున్నామనే భరోసా ఇవ్వాలి. కానీ వైసీపీ ఎమ్మెల్యేల రూటే సపరేట్‌గా ఉంది. కడప జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తుంటే ప్రజల బాధలను గాలికొదిలేసిన వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం గుర్రాలపై స్వారీ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.


రాజంపేట మండలం, ఆకేపాడులో మాజీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఎస్టేట్‌లో వైసీపీ నేతలు సరదాల్లో మునిగితేలారు. అమర్‌నాథ్ రెడ్డితోపాటు ప్రభుత్వ చీప్ విప్ శ్రీకాంత్ రెడ్డి, కోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కొరుముట్ల శ్రీనివాసులు, కడప మేయర్ సురేష్ బాబు సరదాగా ఎస్టేట్‌లో ఎంజాయ్ చేశారు. అమర్‌నాథ్ రెడ్డికి చెందిన గుర్రాలను తీసుకుని ఎస్టేట్‌కు దగ్గరలో ఉన్న చెయ్యేరు నది పరిసరాల్లో గుర్రపుస్వారీ చేస్తూ ఎంజాయ్ చేశారు. నేతల తీరుపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-05-11T20:21:09+05:30 IST