కోడిపందాలు నిర్వహించిన YCP leaders..32 మంది అరెస్ట్

ABN , First Publish Date - 2021-11-07T13:23:30+05:30 IST

చింతలపూడి మండలంలోని యర్రంపల్లిలో వైసీపీ నేతలు నిర్వహించిన కోడిపందాల శిభిరాలపై పోలీసులు దాడులు చేశారు. కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు పక్కాసమాచారం తెలుసుకున్న

కోడిపందాలు నిర్వహించిన YCP leaders..32 మంది అరెస్ట్

పశ్చిమ గోదావరి: చింతలపూడి మండలంలోని యర్రంపల్లిలో వైసీపీ నేతలు నిర్వహించిన కోడిపందాల శిభిరాలపై పోలీసులు దాడులు చేశారు. కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు పక్కాసమాచారం తెలుసుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. జంగారెడ్డి గూడెం డీఎస్పీ రవికిరణ్, సెబ్ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. కోడిపందాలు నిర్వహిస్తున్న 32 మందిని అరెస్ట్ చేయగా, మరికొందరు పరారయ్యారు. సుమారుగా రూ. లక్ష నగదు, 40 బైకులు, 20 కార్లు, 60 కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-11-07T13:23:30+05:30 IST