కృష్ణా జిల్లాలో వైసీపీ నేతల దౌర్జన్యం
ABN , First Publish Date - 2021-09-05T22:58:03+05:30 IST
తోట్లవల్లూరు మండలం చిన్న పులిపాకలో వైసీపీ నేతల దౌర్జన్యానికి దిగారు. టీడీపీ నేత కాగిత శ్రీనివాసరావుపై సర్పంచ్ శివరామకృష్ణ కర్రలతో దాడి చేశారు.
కృష్ణా: తోట్లవల్లూరు మండలం చిన్న పులిపాకలో వైసీపీ నేతల దౌర్జన్యానికి దిగారు. టీడీపీ నేత కాగిత శ్రీనివాసరావుపై సర్పంచ్ శివరామకృష్ణ కర్రలతో దాడి చేశారు. అడ్డువచ్చిన మహిళలను కూడా సర్పంచ్ శివరామకృష్ణ కొట్టారు. టీడీపీ నుంచి వార్డు మెంబర్గా శ్రీనివాసరావు పోటీచేసినందుకే దాడిచేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు. పోలీస్ స్టేషన్లో టీడీపీ, వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అండతో ముందుగానే టీడీపీ నేతలపై శివరామకృష్ణ కేసు పెట్టారు. కేసు పెట్టి ఆస్పత్రికి వెళ్తుండగా మరోసారి శ్రీనివాసరావుపై వైసీపీ వర్గీయుల దాడి చేశారు. ఈ దాడిలో శ్రీనివాసరావుకు తీవ్రగాయాలయ్యాయి. ఆయనను వెంటనే విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.