అది ఎమ్మెల్యేల బాధ్యత: మంత్రి బొత్స

ABN , First Publish Date - 2020-04-08T03:10:08+05:30 IST

కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

అది ఎమ్మెల్యేల బాధ్యత: మంత్రి బొత్స

విశాఖపట్నం: కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రతిరోజు 1170 మందికి పరీక్షలు చేసే సామర్థ్యం ఉందని బొత్స చెప్పారు. గ్రామాల్లోకి వెళ్లి పంటను కొనుగోలు చేస్తున్నామని, నిత్యావసరాలు అందుబాటులో ఉంచుతున్నామని బొత్స పేర్కొన్నారు. కొందరు కావాలని విమర్శలు చేస్తున్నారని, రూ.వెయ్యి పంపిణీ చేయడం ఎమ్మెల్యేల బాధ్యత బొత్స తెలిపారు. ప్రజల ప్రాణాలు ముఖ్యం, లాక్‌డౌన్‌ ఉండాలని ఎవరూ కోరుకోరని బొత్స అన్నారు.

Updated Date - 2020-04-08T03:10:08+05:30 IST