చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ఫైర్

ABN , First Publish Date - 2020-04-09T22:29:02+05:30 IST

టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి

చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ఫైర్

నెల్లూరు: టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరోనా పరిణామాలను అనుకూలంగా మార్చుకుని వైసీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి అవసరమైతే సలహాలు, సూచనలు ఇవ్వాలని, ఇలాంటి సంక్షోభ సమయంలో ఆరోపణలు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి రాజకీయ నాయకుడు ఏపీలో ఉండడం దురదృష్టకరమని అన్నారు. దరిద్రుడు, పనికిమాలిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం ప్రజలు చేసుకున్న కర్మ అని అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు బుద్ది తెచ్చుకుని హైదరాబాద్ నుంచి విజయవాడకు రావాలని నల్లపురెడ్డి అన్నారు.

Updated Date - 2020-04-09T22:29:02+05:30 IST