పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదు: ఎమ్మెల్యే మేరుగ నాగార్జున

ABN , First Publish Date - 2021-07-12T13:36:24+05:30 IST

సాగునీటి కాల్వల్లో పూడికతీత పనుల్లో..

పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదు: ఎమ్మెల్యే మేరుగ నాగార్జున

కొల్లూరు: సాగునీటి కాల్వల్లో పూడికతీత పనుల్లో నాణ్యత లోపిస్తే సహించబోమని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున హెచ్చరించారు. ఆదివారం కొల్లూరు లాకుల వద్ద కాల్వ ల పూడికతీత పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ అనంతవరం నుంచి రావిఅనంతవరం వరకు రూ.16 లక్షల వ్యయంతో సాగునీటి కాల్వల్లో పూడిక తీత పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. గుత్తేదారులు పూడికతీత పనులు నిబంధనల మేరకు చేపట్టాలని సూచించారు. పనుల విషయంలో ఎక్కడ తేడా జరిగినా మళ్లీ ఆ పనులను పూర్తిగా చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి పనిని తానే స్వయంగా పరిశీలిస్తానన్నారు. ఎక్కడ లోపం కనిపించినా ఆయా పనుల బిల్లులు మంజూరు చేసే ప్రసక్తే లేదన్నారు. వర్షాకాలం ప్రారంభమయిన నేపథ్యంలో ఖరీఫ్‌లో రైతులు ఎలాంటి సాగునీటి ఇబ్బందులు కలగకుండా గుత్తేదారులు పనులు సక్రమంగా త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పార్టీ నాయకులు నర్రా అప్పారావు, ఘంటా శివరంగారావు, వెనిగళ్ల శ్రీనివాసరావు, నిమ్మగడ్డ శివరామకృష్ణ, గద్దె నాగేశ్వరరావు, సూర్యదేవర రామకృష్ణ, మోషే, ప్రకాష్‌, ఇరిగేషన్‌ ఏఈ శ్వేత  పాల్గొన్నారు.

Updated Date - 2021-07-12T13:36:24+05:30 IST