న్యాయం అడిగిన రమ్య కుటుంబానికి ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

ABN , First Publish Date - 2021-08-16T23:09:33+05:30 IST

న్యాయం అడిగిన రమ్య కుటుంబానికి ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

న్యాయం అడిగిన రమ్య కుటుంబానికి ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

గుంటూరు: న్యాయం చేయాలని రమ్య  కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే భరోసా కల్పించాల్సిన ఎమ్మెల్యేనే వారి పట్ల దురుసుగా ప్రవర్తించడం కలకలం రేపుతోంది. దిశ చట్టం ద్వారా 21 రోజుల్లో నిందితుడికి మరణ శిక్ష పడేలా చూడాలని రమ్య కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ తరుణంలో వేమూరు ఎమ్మెల్యే మెరుగు నాగార్జున సహనం కోల్పోయారు. ‘‘దిశ చట్టం ఎక్కడుందో మాకు తెలుసు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీతో చెప్పించుకునే స్థాయిలో మేము లేము. మీతో చెప్పించుకోవడానికి మేం రాలేదు.’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 



Updated Date - 2021-08-16T23:09:33+05:30 IST