జగన్‌రెడ్డి ప్రోద్భలంతో రెచ్చిపోతున్న వైసీపీ మూకలు: అచ్చెన్న

ABN , First Publish Date - 2021-05-07T10:00:20+05:30 IST

‘‘ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ప్రోద్భలంతో రాష్ట్రంలో వైసీపీ మూకలు రెచ్చిపోతున్నాయి. అధికారంలో ఉన్నామన్న అహంకారంతో ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నాయి’’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

జగన్‌రెడ్డి ప్రోద్భలంతో రెచ్చిపోతున్న వైసీపీ మూకలు: అచ్చెన్న

అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): ‘‘ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ప్రోద్భలంతో రాష్ట్రంలో వైసీపీ మూకలు రెచ్చిపోతున్నాయి. అధికారంలో ఉన్నామన్న అహంకారంతో ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నాయి’’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లా రే ణిగుంట మండలం కృష్ణాపురంలో టీడీపీ మాజీ సర్పంచి రామస్వామి ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడిని గురువారం ఒక ప్రకటనలో ఆయన తీవ్రంగా ఖండించారు. అర్ధరాత్రి కత్తులు, కర్రలతో దాడి చేసి రామస్వామిని చంపాలని చూశారని ఆరోపించారు. ఈ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నవారితోపాటు, పరోక్షంగా సహకరించిన వారిపై కూడా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దాడులకు పాల్పడుతున్నవారు మున్ముందు మూల్యం చెల్లించక తప్పదన్నారు. అప్పుడు వారిని కాపాడటానికి జగన్‌రెడ్డి రాష్ట్రంలో కూడా ఉండడని హెచ్చరించారు. రానున్నది టీడీపీ ప్రభుత్వమేనని, అప్పుడు ఎవరినీ వదిలే సమస్యే లేదని అచ్చెన్న వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-05-07T10:00:20+05:30 IST