దళిత మహిళతో వైసీపీ ఎంపీ సెటిల్మెంట్ కథ...
ABN , First Publish Date - 2021-12-10T15:54:09+05:30 IST
రాయలసీమలో ఆయన అధికారపార్టీ ఎంపీ.. ఆయన చుట్టూ ఇప్పటికే ఎన్నో వివాదాలు.. అయితే...
అనంతపురం: రాయలసీమలో ఆయన అధికారపార్టీ ఎంపీ.. ఆయన చుట్టూ ఇప్పటికే ఎన్నో వివాదాలు.. అయితే ఈ వివాదాల ఎంపీ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. ఓ దళిత మహిళతో సెటిల్మెంట్ కోసం ఈ ఎంపీ నానా పాట్లు పడ్డారు. ఇప్పుడు ఈ సెటిల్మెంట్ వ్యవహారం రాజకీయ, పోలీస్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
ఏపీలో అధికార పార్టీ ఎంపీ సెటిల్ మెంట్ కథ.. గతంలో పోలీస్శాఖలో ఆ ఎంపీ పనిచేశారు. ఆ సమయంలో ఓ అత్యాచారం కేసు నమోదయింది. ఆ కేసు ఇప్పుడు కోర్టుకు చేరింది. దీంతో ఎంపీకి టెన్షన్ పట్టుకుంది. కేసు ఎక్కడ తన మెడకు చుట్టుకుంటుందోనని ఎంపీ భయపడ్డారు. వివాదాన్ని సెటిల్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే దళిత వర్గానికి చెందిన బాధిత కుటుంబం ఒప్పుకోలేదు. దాంతో ఎంపీ మరింత కలవరపడ్డారు. ఎలాగైన సమస్యను పరిష్కరించుకోవాలని నిర్ణయించి.. గతంలో తనతో పనిచేసిన పోలీసులను పురమాయించారు. ఎంపీ చెప్పిందే తడవుగా ఖాకీ మిత్రులు రంగంలోకి దిగారు. దళిత మహిళను బెదిరించి బుజ్జగించి దారికి తెచ్చారు. భారీ మొత్తంలో నగదు దళిత మహిళకు ముట్టజెప్పి ఎంపీ సమక్షంలోనే పోలీసులు మేటర్ సెటిల్ చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.