వైసీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు: పవన్ కళ్యాణ్

ABN , First Publish Date - 2020-11-22T23:38:14+05:30 IST

వైసీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు: పవన్ కళ్యాణ్

వైసీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు: పవన్ కళ్యాణ్

గుంటూరు: వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ మరోక్షంగా విమర్శలు గుప్పించారు. శ్రీకాళహస్తి జనసేన ఇన్‌చార్జ్ వినుత కోటా ఇంటిపై దాడి చేయడం అమానుషమని పవన్‌ కళ్యాణ్ అన్నారు. ప్రశ్నించినవారిపై అధికార గర్వంతో దాడులకు తెగబడుతున్నారని పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు.


బాధితులపైనే ఎదురు కేసు నమోదు చేయడం ఏమిటి? అని పవన్‌కళ్యాణ్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనిపిస్తోంది?, అధికార పక్షం అరాచకాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని పవన్ అన్నారు. జనసేన మౌనంగా ఉండదని, కచ్చితంగా నిలదీసి ప్రశ్నిస్తుందని పవన్ తెలిపారు.

Updated Date - 2020-11-22T23:38:14+05:30 IST