అవినీతితో వైసీపీ నేతలకు కాసుల పంట: టీడీపీ నేత
ABN , First Publish Date - 2021-06-12T05:11:02+05:30 IST
అవినీతితో వైసీపీ నేతలకు కాసుల పంట: టీడీపీ నేత
గుంటూరు: రెండేళ్లుగా ఏపీలో అభివృద్ధి, ఉపాధి, ఆదాయం,పెట్టుబడులు పడిపోయాయని టీడీపీ నేత దేవతోటి నాగరాజు విమర్శించారు. అవినీతి, అరాచకం, దోపిడీ, పన్నులు, అప్పులు, ప్రభుత్వ ఆస్తుల తనఖా ఫుల్ గా ఉన్నాయని ఆయన ఆరోపించారు. సంక్షేమం పేరిట ప్రజలకు మోసాలు, అవినీతితో వైసీపీ నేతలకు కాసుల రాసులు వస్తున్నాయని టీడీపీ నేత అన్నారు. వైసీపీ పాలనలో రాష్టాభివృద్దికి ప్రణాళికలు శూన్యం, రాష్టాన్ని దోచుకునేందుకే ప్రాధాన్యం ఇచ్చారని ఆయన ఆక్షేపించారు.