వైసీపీ హయాంలో నిరుద్యోగ సమస్య పెరిగింది: కోట్ల

ABN , First Publish Date - 2021-11-10T22:15:01+05:30 IST

వైసీపీ హయాంలో నిరుద్యోగ సమస్య పెరిగిందని టీడీపీ నేత కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. బుధువారం ఆయన మీడియాతో

వైసీపీ హయాంలో నిరుద్యోగ సమస్య పెరిగింది: కోట్ల

కర్నూలు: వైసీపీ హయాంలో నిరుద్యోగ సమస్య పెరిగిందని టీడీపీ నేత కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. బుధువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ హయాంలో మంజూరు చేసిన ప్రాజెక్టులను.. పూర్తి చేయకుండా ప్రభుత్వం ఎందుకు పెండింగ్‌లో పెట్టిందని ప్రశ్నించారు. రైతులు పండించే పంటకు పూర్తి స్థాయిలో నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 15 తర్వాత నీళ్లు బంద్ చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రకటించారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు పూర్తి చేయడంలేదని కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి విమర్శించారు.

 









Updated Date - 2021-11-10T22:15:01+05:30 IST