జీవీఎంసీలో వైసీపీ బెదిరింపులు: అచ్చెన్న

ABN , First Publish Date - 2021-02-25T09:11:59+05:30 IST

గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులను అధికార పార్టీ బెదిరిస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. బుధవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో

జీవీఎంసీలో వైసీపీ బెదిరింపులు: అచ్చెన్న

విశాఖపట్నం, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులను అధికార పార్టీ బెదిరిస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. బుధవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు.  తమ పార్టీ అభ్యర్థుల వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుని బెదిరిస్తున్నారని చెప్పారు. ఎన్నికలు జరిగితే ప్రజలు ఛీకొట్టే పరిస్థితి ఉందని గ్రహించే విజయసాయిరెడ్డి భయపెట్టి వార్డులను ఏకగ్రీవం చేసుకునేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నేతల బెదిరింపులు, ఒత్తిళ్లను పరిగణనలోకి తీసుకుని తమ పార్టీ అభ్యర్థులకు అన్నివిధాలా భరోసా కల్పిస్తామని చెప్పారు.

Updated Date - 2021-02-25T09:11:59+05:30 IST