యడియూరప్ప సర్కార్‌ పతనం కోరుకోను : దేవేగౌడ

ABN , First Publish Date - 2020-02-20T13:13:27+05:30 IST

యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌ పతనం కోరుకునేది లేదని మాజీ ప్రధాని దేవేగౌడ పేర్కొన్నారు.

యడియూరప్ప సర్కార్‌ పతనం కోరుకోను : దేవేగౌడ

బెంగళూరు : యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌ పతనం కోరుకునేది లేదని మాజీ ప్రధాని దేవేగౌడ పేర్కొన్నారు. బెళగావిలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికలకోసం పార్టీని బలోపేతం చేయడమే నా ఆశయమన్నారు. మాకు సమయం కావాలని రాష్ట్రమంతటా పర్యటించి పార్టీలో శక్తిని నింపుతానన్నారు. అవినీతిరహిత పాలన సాగిస్తానని హామీ ఇచ్చిన యడియూరప్ప మా ప్రభుత్వంలోనూ కొనసాగుతోందని స్వయంగా అంగీకరించారని ఇకపై ఆ విషయం మాట్లాడనన్నారు. ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరేది లేదన్నారు.


సిద్దరామయ్యతోపాటు కొందరు ప్రముఖుల సూచన మేరకే ముంబై వెళ్లామని, దేవేగౌడను ముగించాలన్నదే వ్యూహం అని చెప్పుకొన్నారని... అందుకే సంకీర్ణ ప్రభుత్వం కూలిందని ఆ విషయం అందరికీ తెలిసిందేనన్నారు. జీటీ దేవేగౌడ ఏ పార్టీలోకి చేరుతారో నాకు తెలియదన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్లు కోనరెడ్డి, నాసిర్‌ భగవాన్‌, అశోక్‌ పూజారి, శంకర్‌ మాడలిగ, ఫైలుల్లా పాల్గొన్నారు.

Updated Date - 2020-02-20T13:13:27+05:30 IST