Mancherial: ఎల్లంపల్లి ప్రాజెక్ట్కు భారీగా వరద
ABN , First Publish Date - 2021-07-22T19:37:30+05:30 IST
ఎల్లంపల్లి ప్రాజెక్ట్లోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది.
మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్ట్లోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 35 గేట్లు ఎత్తివేసి 2లక్షల 50వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 157879 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి నిల్వ 18.7862 టీఎంసీలుగా కొనసాగుతోంది.