అబుధాబీలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు సహా ముగ్గురు మృతి

ABN , First Publish Date - 2022-01-17T22:52:11+05:30 IST

అబుధాబీ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుధాబీ ఎయిర్‌పోర్ట్‌‌ సమీపంలో యెమెన్ హౌతీ ఉగ్రవాదులు డ్రోన్ల ద్వారా జరిపిన దాడుల్లో ఇద్దరు భారతీయులు సహా ముగ్గురు చనిపోయారు.

అబుధాబీలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు సహా ముగ్గురు మృతి

అబుధాబీ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుధాబీ ఎయిర్‌పోర్ట్‌‌ సమీపంలో యెమెన్ హౌతీ ఉగ్రవాదులు డ్రోన్ల ద్వారా జరిపిన దాడుల్లో ఇద్దరు భారతీయులు సహా ముగ్గురు చనిపోయారు. ఆరుగురు గాయపడ్డారు. ఘటనలో మూడు పెట్రోల్ ట్యాంకర్లు పేలిపోయాయి. దాడుల నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. దాడి తమ పనే అని హౌతీ ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు. 

Updated Date - 2022-01-17T22:52:11+05:30 IST