వర్షాభావంతో తగ్గనున్న దిగుబడి
ABN , First Publish Date - 2021-10-24T05:15:39+05:30 IST
జిల్లాలో ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో లోటు వర్షపాతం నమోదైనందున వేరుశనగ, పత్తి, మొక్కజొన్న పంటల దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉందని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డా.ఎన్సీ వెంకటేశ్వర్లు అన్నారు.
- ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ డాక్టర్ వెంకటేశ్వర్లు
నంద్యాల టౌన్, అక్టోబరు 23: జిల్లాలో ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో లోటు వర్షపాతం నమోదైనందున వేరుశనగ, పత్తి, మొక్కజొన్న పంటల దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉందని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డా.ఎన్సీ వెంకటేశ్వర్లు అన్నారు. ఆర్ఏఆర్ఎస్లో శిక్షణ, సందర్శన సమావేశాన్ని శనివారం నిర్వహించారు. జిల్లా వ్యవసాయశాఖ జేడీ పీఎస్ వరలక్ష్మి, ఆత్మ పీడీ ఉమామహేశ్వరమ్మ, డీడీఏ బోస్బాబు, వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని పంటల పరిస్థితులను, వివిధ సమస్యలను ఈ సమావేశంలో చర్చించామని ఏడీఆర్ తెలిపారు. సబ్ డివిజన్లలో సహాయ సంచాలకులకు వారి వారి పరిధిలో పంటల పరిస్థితులను వివరించారు. శనగ, జొన్న పంటల శాస్త్రవేత్తలు అధికదిగుబడి పొందడానికి మెలకువలను తెలిపారు. వివిధ పంటల్లో ప్రస్తుతం ఉన్న తెగుళ్లు, పురుగుల యాజమాన్యం గురించి చర్చించారు. కార్యక్రమంలో కీటక విభాగం శాస్త్రవేత్త డా.జె రవీంద్రనాథ్, వివిధ పంటల శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.