మోదీ ప్రతిపాదనతోనే యోగా దినోత్సవం

ABN , First Publish Date - 2021-06-22T04:32:08+05:30 IST

నరేంద్రమోదీ ప్రధానమంత్రి పదవి చేపట్టిన తరువాత యోగా చేయాలని ప్రపంచ దేశాలకు చేసిన ప్రతిపాదనతో 161 దేశాలు అంగీకరించి జూన్‌ 21

మోదీ ప్రతిపాదనతోనే యోగా దినోత్సవం

సంగం, జూన్‌ 21: నరేంద్రమోదీ ప్రధానమంత్రి పదవి చేపట్టిన తరువాత యోగా చేయాలని ప్రపంచ దేశాలకు చేసిన ప్రతిపాదనతో 161 దేశాలు అంగీకరించి జూన్‌ 21 తేదీని అంతర్జాతీయ యోగా డేగా జరుపుకోవడం జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయులురెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన సంగం బంగ్లా సెంటర్‌లో అంతర్జాతీయ యోగా డే దినోత్సవంపై మాట్లాడారు. దేశం లో కరోనా టీకా కొరత లేదని ప్రతి ఒక్కరు టీకా వేయించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కిసాన్‌ మోర్చ జిల్లా అధ్యక్షుడు కాలం బుజ్జిరెడ్డి, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T04:32:08+05:30 IST