వాడవాడలా అంతర్జాతీయ యోగా దినోత్సవం
ABN , First Publish Date - 2021-06-22T02:52:54+05:30 IST
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సోమవారం రెడ్క్రాస్ ఆధ్వర్యంలో నిత్యయోగా సాధన కేంద్రంలో వేడుకలు జరిగాయి. యో
కావలిటౌన్, జూన్21: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సోమవారం రెడ్క్రాస్ ఆధ్వర్యంలో నిత్యయోగా సాధన కేంద్రంలో వేడుకలు జరిగాయి. యోగా కేంద్రం కన్వీనర్ హరినాథరెడ్డి అధ్యతన జరిగిన కార్యక్రమంలో యోగా గురువు జనార్దన్ రెడ్డి యోగాసాధకులచే ఆసనాలు వేయించారు. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కనమర్లపూడి నారాయణ పాల్గొని, యోగా గురువులు జనార్దన్రెడ్డి, బాలమురళీకృష్ణలను సత్కరించారు. కనమర్లపూడి నారాయణ ఆధ్వర్యంలో యోగా సాధకులు రక్తదానం చేసారు. ఈ కార్యక్రమంలో రెడ్క్రాస్ జిల్లా ఉపాద్యక్షులు దామిశెట్టి సుదీర్నాయుడు, చైర్మన్ రవిప్రకాష్, కార్యదర్శి గంధం ప్రసన్నాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ ఆధ్వర్యంలో..
బీజేపీ ఆధ్వర్యంలో పుల్లారెడ్డినగర్లోని గొట్టిపాటి కల్యాణమండపంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది. పార్టీ పట్టణ అధ్యక్షుడు బ్రహ్మానందం అధ్యతన జరిగిన కార్యక్రమంలో యోగాసానాల అనంతం యోగా గరువు బాలమురళీకృష్ణను సత్కరించారు. కార్యక్రమంలో నేతలు పాలడుగు సుభాషిణి, వీవీ రంగారెడ్డి, సీవీసీ సత్యం, పీ మాధవి, వాయుగండ్ల సుదీర్, తదితరులు పాల్గొన్నారు.
కావలి రూరల్లో..
కావలి రూరల్, జూన్21: యోగాతో మానసిక ఒత్తిడి నుంచి దూరంగా ఉండవచ్చని బీజేపీ రూరల్ మండల అధ్యక్షుడు మామిడి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కావలి రూరల్ మండలం పెద్దపట్టపుపాలెంలో సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. మండల అధ్యక్షుడు మామిడి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యోగా సూర్య నమస్కారాలు, ఆసనాలు వేశారు. కార్యక్రమం లో మండల బీజేపీ నాయకులు బండ్ల వేణు, ప్రళయకావేరి ఏడుకొండలు, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
ఉదయగిరిలో...
ఉదయగిరి రూరల్, జూన్ 21: ప్రతిరోజు యోగా చేయవడం ద్వారా మానసిక ప్రశాంతతోపాటు ఆరోగ్యకరంగా ఉంటారని బీజేపీ రాష్ట్ర ఓబీసీ కార్యవర్గ సభ్యుడు ఆవుల రోశయ్యయాదవ్ తెలిపారు. సోమవారం ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు గెట్టిబోయిన వెంకటేశ్వర్లు, చల్లా సుబ్బరత్నం, సయ్యద్ షాజహాన్, వెంకటేశ్వర్లు, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.