అన్నను చంపిన తమ్ముడు
ABN , First Publish Date - 2021-01-17T04:50:03+05:30 IST
అన్నను చంపిన తమ్ముడు
మద్యం మత్తులో దారుణం
మంగపేట, జనవరి 16 : మద్యం మత్తులో సొంత అన్ననే హత్య చేశాడు ఓ తమ్ముడు. రోజంతా పని చేసి సాయంత్రం మద్యం తాగేందుకు వెళ్లి అక్కడ వివాదం తలెత్తడంతో కోపోద్రిక్తుడైన తమ్ముడు కర్రతో బలంగా అన్న తలపై బాదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని బాలన్నగూడెం పంచాయతి పరిధిలోని నరేందరావుపేటలో శనివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన కల్తీ శంకర్- పెంటమ్మల కుమారులైన నవీన్ (35), నాగబాబు కూలిపనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. శనివారం వీరిద్దరూ ఓ వ్యవసాయ క్షేత్రంలోకి పనికి వెళ్లారు. సాయంత్రం పనులు ముగించుకొని ఉళ్లోకి వచ్చి మద్యం తాగేందుకు ఓ బెల్ట్షాపులోకి వెళ్లారు. మద్యం తాగుతుండంగా ఇద్దరి మధ్య చిన్న వాదన జరుగగా నాగబాబు తన పక్కనే ఉన్న దుడ్డుకర్రతో నవీన్ తలపై బలంగా కొట్టాడు. రెండు మూడు సార్లు బాదడంతో నవీన్ అక్కడికక్కెడే మృతి చెందాడు. ఘటనాస్థలం నుంచి పారిపోయేందుకు యత్నించిన నాగబాబును గ్రామస్థులు తాళ్లతో కాళ్లు, చేతులు కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏటూరునాగారం సీఐ సట్ల కిరణ్కుమార్ అక్కడికి చేరుకొని శవ సంచనామా చేయించి మృతదేహాన్ని ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించారు. నవీన్కు భార్య నాగమణి ఇద్దరు కుమారులు ఉన్నారు. నగమణి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.