నేరేడు తినాల్సిందే!
ABN , First Publish Date - 2021-06-16T05:30:00+05:30 IST
నేరేడు పండ్లను చూస్తే నోరూరుతుంది. వాటిని తింటే జిహ్వచాపల్యం తీరడంతో పాటు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అవేమిటంటే...
నేరేడు పండ్లను చూస్తే నోరూరుతుంది. వాటిని తింటే జిహ్వచాపల్యం తీరడంతో పాటు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అవేమిటంటే...
- వీటిలో విటమిన్-సి, ఐరన్ ఉంటుంది. వీటిని తినడం వల్ల హీమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. రక్తంలో ఆక్సిజన్ సరఫరా మెరుగవుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
- నేరేడు పండ్లను తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కంటి చూపు పెరుగుతుంది. వీటిలో ఉన్న పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. 100 గ్రాముల నేరేడు పండ్లలో 55 మి.గ్రా పొటాషియం లభిస్తుంది. రక్తనాళాలు గట్టిపడటాన్ని నిరోధిస్తుంది.
- దంతాలు, చిగుళ్లు గట్టిపడతాయి. ఇందులో ఉన్న యాంటీబ్యాక్టీరియల్ గుణాలు చిగుళ్ల రక్తస్రావాన్ని అరికడతాయి. జింజివైటిస్కు చికిత్సగా పనికొస్తుంది.
- సాధారణ ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా చూడటంలో నేరేడు పండ్లు బాగా ఉపయోగపడతాయి.
- డయాబెటిస్ లక్షణాలను తగ్గించడంలోనూ ఉపయోగపడతాయి. వీటిలో ఉన్న లో గ్లైసెమిక్ ఇండెక్స్ రక్తంలో షుగర్ స్థాయిలను సాధారణంగా ఉంచుతుంది. నేరేడు ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగేలా చేస్తుంది.
- కొన్ని నేరేడు పండ్లు తీసుకుని అందులో పావు టేబుల్స్పూన్ బ్లాక్సాల్ట్, తేనే, కొద్దిగా అల్లంముక్క, చిటికెడు చాట్మసాలా వేసి మిక్సీలో బ్లెండ్ చేసుకోవాలి. నేరేడు పండ్లు విత్తనాలు తీసి వేసుకోవాలి. ఈ జ్యూస్ తాగడం వల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది.