చదువు పూర్తయ్యాక తిరిగి వెళ్లాల్సిందే..

ABN , First Publish Date - 2021-07-30T06:35:50+05:30 IST

ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన విద్యార్థులు చదువు పూర్తయ్యాక స్వదేశాలను

చదువు పూర్తయ్యాక తిరిగి వెళ్లాల్సిందే..

  • ఓపీటీ ప్రోగ్రామ్‌ రద్దు కోసం అమెరికాలో బిల్లు
  • 80 వేల మంది భారతీయ విద్యార్థులపై ప్రభావం

 

వాషింగ్టన్‌,జూలై 29: ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన విద్యార్థులు చదువు పూర్తయ్యాక స్వదేశాలను వెళ్లాల్సిందేనని ఆ దేశానికి చెందిన చట్టసభ సభ్యులు కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు అమెరికా చట్టాల్లో మార్పులు కోరుతున్నారు. విదేశీ విద్యార్థులు చదువు పూర్తయినా అక్కడే ఉం టూ ఉద్యోగం వెతుక్కోవడానికి వీలుకల్పించే ఆప్షనల్‌ ప్రాక్టీ స్‌ ట్రైనింగ్‌(ఓపీటీ) ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలని కోరుతూ బిల్లును సైతం ప్రవేశపెట్టారు. ఇది చట్టంగా మారితే విదేశీ విద్యార్థులు అమెరికాలో చదువు పూర్తి కాగానే స్వదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది.


ఓపీటీ ఆధారంగా అమెరికాలో ఉంటున్న 80 వేల మంది భారతీయ విద్యార్థులకు కూడా ఇబ్బందులు తప్పవు. ఓపీటీని తొలగించడం కోసం ‘ఫెయిర్‌నెస్‌ ఫర్‌ హై-స్కిల్డ్‌ అమెరికన్స్‌ యాక్ట్‌’ పేరుతో ప్రతినిధుల సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఓపీటీ వల్ల అమెరికాకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్‌ సభ్యులు అన్నారు. విదేశీ విద్యార్థులు తక్కువ వేతనాలకు లభిస్తుండటంతో అమెరికాలోని వ్యాపార సంస్థలు వారికే ఉద్యోగాలిస్తున్నాయని, స్థానిక విద్యార్థులకు అన్యా యం చేస్తున్నాయని వారు ఆరోపించారు. అయితే బిల్లును ప్రవేశపెట్టిన సభ్యులు రిపబ్లికన్‌ పార్టీకి చెందినవారు కావడంతో ఈ బిల్లు సెనేట్‌ ఆమోదం పొందడం అంత తేలిక కాదని నిపుణులు చెబుతున్నారు.


Updated Date - 2021-07-30T06:35:50+05:30 IST