మాస్క్‌ వేసుకున్నా మీరెవరో తెలిసిపోతుంది!

ABN , First Publish Date - 2020-02-27T21:37:32+05:30 IST

కరోనా అనే కోవిడ్‌-19 వైరస్‌ వచ్చి, చైనాలో ఎందరి ప్రాణాలో తీసుకుంటోంది. అందుకే అక్కడ చాలామంది పాపం భయంతో మాస్క్‌లు వేసుకు

మాస్క్‌ వేసుకున్నా మీరెవరో తెలిసిపోతుంది!

హైదరాబాద్:  కరోనా అనే కోవిడ్‌-19 వైరస్‌ వచ్చి, చైనాలో ఎందరి ప్రాణాలో తీసుకుంటోంది. అందుకే అక్కడ చాలామంది పాపం భయంతో మాస్క్‌లు వేసుకు తిరుగుతున్నారు. అయితే కొత్తగా వచ్చిన బాధేంటంటే - ఈ మాస్క్‌ల వల్ల ఫోనుల్లో ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ పనిచేయడం లేదట. ఇందువల్ల విపరీతంగా స్మార్ట్‌ ఫోన్లు వాడే చైనీయులు ఈ పరిణామం వల్ల ఇబ్బందులు పడుతున్నారట. అందుకే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఫేషియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీల మీద పనిచేసే చైనీస్‌ సంస్థలు కొన్ని ఈ సమస్యను పోగొట్టేందుకు ముందుకొచ్చాయి.


సెన్స్‌ టైమ్‌ SenseTime కింగ్‌ ఫీ Qingfei అనే ఈ సంస్థలు - మాస్క్‌ ధరించినప్పటికీ ముఖాన్ని గుర్తించే విధంగా ఓ కొత్త ఆల్గారిథమ్‌ని డెవలప్‌ చేశాయి. ముఖం మీద 14 కీ పాయింట్లని గుర్తిస్తూ - వాటి ఆధారంగా ముఖాన్ని గుర్తుపట్టే ఈ టెక్నాలజీ అప్‌డేట్‌ కలిగిన ఫోన్లు త్వరలో రాబోతున్నాయట. అవి వస్తే - ఇక మాస్క్‌ ధరించినా ముఖాన్ని గుర్తుపట్టడంలో ఫోన్‌ ఇబ్బంది పడదు. యూజర్ని ఇబ్బంది పెట్టదు!

Updated Date - 2020-02-27T21:37:32+05:30 IST