ఆమెకు అతను ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. కలుసుకుందాం రమ్మన్నాడు.. ఆనందంగా వెళ్లిన ఆమెకు ఊహించని షాక్..

ABN , First Publish Date - 2021-11-15T17:43:09+05:30 IST

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో 14 ఏళ్ల బాలికను..

ఆమెకు అతను ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. కలుసుకుందాం రమ్మన్నాడు.. ఆనందంగా వెళ్లిన ఆమెకు ఊహించని షాక్..

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో 14 ఏళ్ల బాలికను మాయంచేసి, ఆమెపై అత్యాచారం జరిపిన ఘటన వెలుగుచూసింది. ఈ బాలికకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక యువకునితో పరిచయం ఏర్పడింది. ఆ యువకుడు ఒకసారి కలుసుకుందామంటూ ఆ బాలికను ఆహ్వానించాడు. ఆమెను తన ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడ తన ఇద్దరు స్నేహితులతో పాటు ఆమెను బంధించి అత్యాచారం జరిపాడు. అయితే ఆ మర్నాడు ఆ బాలిక వారి బారి నుంచి తప్పించుకుని తన ఇంటికివెళ్లి, కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని తెలిపింది. దీంతో వారు ఈ ఘటనపై  పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


వారు ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. ప్రథాన నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పలు విషయాలు తెలిపింది. తాను అతను చెప్పిన ప్రాంతానికి వెళ్లగానే, తనను బలవంతంగా అతని బైక్‌పై కూర్చోబెట్టుకుని తీసుకువెళ్లిపోయాడని తెలిపింది. ఆ తరువాత అత్యాచారం చేశాడని పేర్కొంది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని ఆమె పోలీసులకు తెలిపింది. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-11-15T17:43:09+05:30 IST