ramappa: అప్పటివరకు సంబరాల్లో గడిపిన ఆమె ఒక్కసారిగా ఏమైందో తెలిస్తే..

ABN , First Publish Date - 2021-10-15T18:13:38+05:30 IST

బతుకమ్మ సంబరాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. బతుకమ్మకు తీసుకుని వెళ్తూ ఓ యువతి కిందపడిపోయి ప్రాణాలు వదిలింది. ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండల కేంద్రానికి చెందిన గడ్డం పోషయ్య, రాజమ్మ

ramappa: అప్పటివరకు సంబరాల్లో గడిపిన ఆమె ఒక్కసారిగా ఏమైందో తెలిస్తే..

- బతుకమ్మ వేడుకల్లో అపశ్రుతి

- వెంకటాపూర్‌లో యువతి హఠాన్మరణం


వెంకటాపూర్‌(ramappa): బతుకమ్మ సంబరాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. బతుకమ్మకు తీసుకుని వెళ్తూ ఓ యువతి కిందపడిపోయి ప్రాణాలు వదిలింది. ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండల కేంద్రానికి చెందిన గడ్డం పోషయ్య, రాజమ్మ దంపతుల కుమార్తె సరిత (22) గురువారం సాయంత్రం హఠాన్మరణం చెందింది. రెండు నెలల క్రితమే మండలంలోని నర్సపూర్‌ గ్రామానికి చెందిన కొర్రి నరేష్‌తో ఆమెకు వివాహం జరిగింది. పెళ్లి అయ్యాక తొలి పండుగ దసరాకు భర్తతో కలిసి సరిత తల్లి గారింటికి వచ్చింది. కాలనీ వాసులతో కలిసి బతుకమ్మ ఆడేందుకు సమీపంలోని తాళ్లపాడుకు వెళ్తుండగా మార్గమధ్యలో ఒక్కసారిగాకింద పడిపోయింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను వెంటనే ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారు. సరిత మృతికి కారణాలు తెలియరాలేదు. గుండెపో టుతో ఆమె మృతి చెంది ఉంటుందని భావిస్తున్నట్టు వైద్యులు చెప్పారు. 

Updated Date - 2021-10-15T18:13:38+05:30 IST