దుండిగల్లో యువతి అదృశ్యం.. ఆయనపైనే అనుమానం
ABN , First Publish Date - 2021-04-05T13:01:54+05:30 IST
ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి అదృశ్యమైంది...
హైదరాబాద్/దుండిగల్ : ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి అదృశ్యమైంది. సూరారం నర్సింహ బస్తీకి చెందిన రవి కుమారై దివ్యజ్యోతి (19) ఈ నెల 3న మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. చుట్టు పక్కల వెతికినా ఆచూకీ దొరకలేదు. బెంగళూరులో నివాసముంటున్న ఓ వ్యక్తిపై అనమానంగా ఉందని రవి దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.