కాచిగూడలో యువతి అదృశ్యం
ABN , First Publish Date - 2021-05-03T14:39:59+05:30 IST
కాల్ సెంటర్లో ఉద్యోగం చేస్తున్న ఓ యువతి అదృశ్యమైంది....
హైదరాబాద్/బర్కత్పుర : కాల్ సెంటర్లో ఉద్యోగం చేస్తున్న ఓ యువతి అదృశ్యమైంది. చప్పల్బజార్లో నివాసముంటున్న ఆదినారాయణ కుమార్తె ఇ.రాధిక(18) లక్డీకాపూల్లోని ఓ కాల్సెంటర్లో ఉద్యోగం చేస్తుంది. ఈ నెల 28న ఉద్యోగానికి వెళ్లి తిరిగి రాలేదు. స్నేహితులను, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. ఆదివారం రాధిక చిన్నమ్మ రమ్య కాచిగూడ పీఎస్లో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు.