రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ABN , First Publish Date - 2021-05-16T06:17:48+05:30 IST
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మేడారం, మే 15: ఆటో, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఆటో డ్రైవర్ మృతిచెందాడు. ఈ సంఘటన తాడ్వాయి మండలంలోని కాల్వపల్లి - నార్లాపూర్ గ్రామాల మధ్య శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాల్వపల్లి గ్రామానికి చెందిన పుర్రి మహేష్(23) గోవిందరావుపేట మండలం పస్రా నుంచి కాల్వపల్లి వైపు ఆటో నడుపుకుంటూ వెళుతున్న క్రమంలో నార్లాపూర్ కాల్వపల్లి మధ్యలో ఎదుగా వస్తున్న లారీ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన మహేష్ను ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్న క్రమంలో అతడు మృతి చెందాడు.