బావిలో దిగి యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-04-21T05:29:40+05:30 IST

స్నానం కోసం స్నేహితులతో కలిసి వ్యవసాయ బావిలోకి దిగిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు.

బావిలో దిగి యువకుడి మృతి
రమణ (ఫైల్‌ ఫొటో)

స్నేహితులతో స్నానం చేస్తుండగా ప్రమాదం
ఈత పూర్తిగా రాకపోవడమే కారణం

రావికమతం, ఏప్రిల్‌ 20:
స్నానం కోసం స్నేహితులతో కలిసి వ్యవసాయ బావిలోకి దిగిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. రావికమతం మండలం కొత్తకోటలో మంగళవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.
కొత్తకోట గ్రామానికి చెందిన గట్టా రమణ (20) బంధువు అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. అతని దహన సంస్కారాల అనంతరం ముగ్గురు స్నేహితులతో కలసి గ్రామంలోని వ్యవసాయ బావికి వెళ్లాడు. రమణకు ఈత పూర్తి స్థాయిలో రాకపోయినప్పటికీ స్నేహితులు ఉన్నారనే ధైర్యంతో బావిలోకి దిగాడు. కొంత సేపటికి ఊపిరి ఆడక నీట మునిగిపోయాడు. విషయం గమనించిన అతని స్నేహితులు ఎంత వెతికినప్పటికీ ఫలితం లేకపోవడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి బావిలో గాలించిగా రమణ మృతదేహం లభ్యమైంది. మృతుడి తండ్రి నూకయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కొత్తకోట ఎస్‌ఐ నాగకార్తీక్‌ తెలిపారు. కాగా, కుటుంబానికి ఆధారమైన కుమారుడు రమణ మృతితో తల్లిదండ్రులు, ఇద్దరు చెల్లెళ్లు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Updated Date - 2021-04-21T05:29:40+05:30 IST