విద్యుత్‌షాక్‌తో యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-03-08T05:46:44+05:30 IST

మండలంలోని చందునాయక్‌ తండాకు చెందిన రబిడె సర్ధార్‌సింగ్‌, సరస్వతిల కుమారుడు రబిడె అతిష్‌(18) అనే యువకుడు విద్యుత్‌ షాక్‌తో మృతి చెందాడు.

విద్యుత్‌షాక్‌తో యువకుడి మృతి

బజార్‌హత్నూర్‌, మార్చి 7: మండలంలోని చందునాయక్‌ తండాకు చెందిన రబిడె సర్ధార్‌సింగ్‌, సరస్వతిల కుమారుడు రబిడె అతిష్‌(18) అనే యువకుడు విద్యుత్‌ షాక్‌తో మృతి చెందాడు. ఆదివారం తన ఇంటి ఆవరణలో ఉన్న బోరుకు మరమ్మతు చేస్తున్న క్రమంలో విద్యుత్‌ వైర్‌ తెగి పక్కనే ఉన్న రేకుల షెడ్డుకు తగిలింది. అయితే రేకులు పట్టుకున్న అతిష్‌ ఒక్కసారిగా విద్యుత్‌షాక్‌తో కిందపడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు మండల కేంద్రంలోని ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడని, మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఉదయ్‌కుమార్‌ తెలిపారు.


Updated Date - 2021-03-08T05:46:44+05:30 IST