రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN , First Publish Date - 2020-08-14T11:35:39+05:30 IST

వగ్గంపల్లి జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధి హామీ సీజనల్‌ మేట్‌ పాముల మహేంద్ర (32) మృతి చెందాడు. బాధిత

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

 మరో నలుగురికి గాయాలు


పామూరు, ఆగస్టు 13 : వగ్గంపల్లి జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధి హామీ సీజనల్‌ మేట్‌ పాముల మహేంద్ర (32) మృతి చెందాడు.  బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు మేరకు.. వగ్గంపల్లి జాతీయ రహదారిని పక్కన బహిర్భూమికి వెళ్లి తిరిగి బైక్‌పై ఇంటికి వస్తూ జాతీయ రహదారి దాటుతున్న తరు ణంలో మార్కాపురం నుంచి ఉదయగిరికి వెళ్తున్న ఆటో వేగంగా వచ్చి బైక్‌ ను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న మహేంద్ర కింద పడటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. ఢీ కొట్టిన ఆటో బోల్తా పడగా అందులో ప్ర యాణిస్తున్న  డ్రైవర్‌తో సహా మరో ముగ్గురుకి చిన్నపాటి గాయాలు తగి లాయి.


తీవ్రంగా గాయపడిన మహేంద్రను కుటుంబ సభ్యులు ప్రైవేటు అంబులెన్స్‌లో నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకుపోగా తమ వద్ద వెంటిలేటర్లు లేవని చెప్పి వైద్యశాలలో చేర్పించుకునేందుకు డాక్టర్లు నిరా కరించడంతో తిరిగి పామూరుకు వస్తుండగా మార్గం మధ్యంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.  మహేంద్రకు భార్య, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.  పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కనిగిరి తరలిం చారు.  తండ్రి పెద్ద మాల్యాద్రి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ అంబటి చంద్ర శేఖర్‌ యాదవ్‌ కేసు నమోదు చేశారు. 

Updated Date - 2020-08-14T11:35:39+05:30 IST