రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ABN , First Publish Date - 2022-01-22T04:51:31+05:30 IST
చిట్వేలి-పుల్లంపేట అం బులేరు ఘాట్లో జరిగిన రోడ్డు ప్రమా దం లో శుక్రవారం బత్తిన శ్రీనివాసరావు(24) మృతి చెందాడు.
చిట్వేలి, జనవరి 21: చిట్వేలి-పుల్లంపేట అం బులేరు ఘాట్లో జరిగిన రోడ్డు ప్రమా దం లో శుక్రవారం బత్తిన శ్రీనివాసరావు(24) మృతి చెందాడు. ఎస్ఐ వెంకటేశ్వర్లు వివ రాల మేరకు చనిపోయిన వ్యక్తి గుంటూరు జిల్లా చిలకలూరిపేట దాసరి కాలనీకి చెం దిన బత్తిన శ్రీనివాసరావుగా గుర్తించామ న్నారు.
చిలకలూరిపేట నుంచి రాజంపేట కు సాయంత్రం 4గంటలకు ఏపీ07డీజెడ్1334 నెంబర్ పల్సర్ వాహనంపై అంబు లే రు ఘాట్లో రాజంపేటకు వెళుతుండగా మలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తాపడటంతో మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.