గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-04-21T05:18:42+05:30 IST

గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతిచెందిన సంఘటన బూర్జివలస గ్రామం వద్ద మంగళవారం చోటుచేసుకుంది.

గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి

దత్తిరాజేరు, ఏప్రిల్‌ 20: గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతిచెందిన సంఘటన బూర్జివలస గ్రామం వద్ద మంగళవారం చోటుచేసుకుంది. స్టేషన్‌ బూర్జివలస ఎస్‌ఐ బి.భాగ్యం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సీతానగరం మండలం బూర్జి గ్రామానికి చెందిన చొక్కాపు సాయికుమార్‌ (17), జాగాన ప్రవీణ్‌, పొట్టా రామారావులు మంగళవారం బొలేరో వాహనంలో విశాఖప ట్నం వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా బూర్జివలస గ్రామం వద్ద సాయికుమార్‌ కాలకృత్యాల కోసం వాహనం దిగి నడుచుకుంటూ వెళ్తుండగా, వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయికుమార్‌ తీవ్రంగా గాయపడ్డాడు. 108 వాహనంలో జిల్లా కేంద్రాసుపత్రికి తీసుకువెళ్లగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. సాయికుమార్‌ తండ్రి పకీర్‌నాయుడు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

 

Updated Date - 2021-04-21T05:18:42+05:30 IST