ఎన్టీయార్ జలాశయం వద్ద చిత్తూరువాసి గల్లంతు
ABN , First Publish Date - 2021-10-18T04:07:50+05:30 IST
మండలంలోని కలవకుంట ఎన్టీయార్ జలాశయం వద్ద చిత్తూరువాసి గల్లంతైన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.
పెనుమూరు, అక్టోబరు 17: మండలంలోని కలవకుంట ఎన్టీయార్ జలాశయం వద్ద చిత్తూరువాసి గల్లంతైన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్ఐ నరేంద్ర కథనం మేరకు ... చిత్తూరు నగరం గంగనపల్లెకు చెందిన వేణుగోపాల్ కుమారుడు వినోద్కుమార్(35), ఇతడి తమ్ముడు ప్రవీణ్కుమార్తోపాటు మరో నలుగురు స్నేహితులు కలిసి పెనుమూరు మండలం కలవకుంట ఎన్టీయార్ జలాశయానికి ఆదివారం సాయంత్రం చేరుకున్నారు. పాత తారురోడ్డు పక్కన నీటినిల్వ ఉన్నచోట ఉండగా వారిలో వినోద్కుమార్ ప్రమాదవశాత్తూ కాలుజారి నీవానదిలో పడ్డాడు. అంతకుముందే జలశయం గేట్ ఒకటి ఎత్తి నీటి ప్రవహాన్ని దిగువకు వదలినందున ఆ ప్రవాహంలో గల్లంతయ్యాడని ఫిర్యాదు అందినట్లు తెలిపారు. గల్లంతైన వినోద్కుమార్ ఎలక్ట్రిషియన్గా పనిచేస్తు జీవనం సాగిస్తున్నాడని, అతడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారన్నారు. ఈ సమాచారం తెలిసి వినోద్కుమార్ భార్య హేమలతతోపాటు బంధువులు, స్నేహితులు ఎన్టీయార్ జలాశయం వద్దకు చేరుకుని బోరున విలపించారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చే స్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం చిత్తూరు అగ్నిమాపక సిబ్బంది సహాయంతో గాలిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.