రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-01-21T05:43:38+05:30 IST
మండలంలోని బోయ బొంతిరాళ్ళ గ్రామానికి చెందిన రాజశేఖర్ (28) బుధవారం రైలు కిందపడి ఆత్మ హత్య చేసుకున్నాడు.
క్రిష్ణగిరి/ తుగ్గలి, జనవరి 20: మండలంలోని బోయ బొంతిరాళ్ళ గ్రామానికి చెందిన రాజశేఖర్ (28) బుధవారం రైలు కిందపడి ఆత్మ హత్య చేసుకున్నాడు. గ్రామంలో చిన్న బంకు పెట్టుకొని జీవనం సాగించేవాడు. కొద్దిగా మతిస్తిమితం లేకుండా ప్రవర్తించేవాడు. జీవితంపై విరక్తి చెంది తుగ్గలి మండలం లింగనేనిదొడ్డి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి మృతి చెందాడు. డోన్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.