చెరువులో దళిత యువకుడి మృతదేహం.. ప్రేమే చావుకు కారణమా?

ABN , First Publish Date - 2020-08-11T23:40:35+05:30 IST

నర్సీపట్నం పోలీస్ స్టేషన్ ఎదుట దళితులు ఆందోళనకు దిగారు. రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. నర్సీపట్నం పెద్ద..

చెరువులో దళిత యువకుడి మృతదేహం.. ప్రేమే చావుకు కారణమా?

విశాఖ: నర్సీపట్నం పోలీస్ స్టేషన్ ఎదుట దళితులు ఆందోళనకు దిగారు. రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. నర్సీపట్నం పెద్ద చెరువులో కిషోర్ అనే దళిత యువకుడి మృతదేహం లభ్యం అయింది. కిషోర్‌ను పోలీసులే చంపి చెరువులో పడేశారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఓ హోమ్ గార్డ్ కుమార్తెను కిషోర్ ప్రేమించాడని, ఆ వ్యవహారంలోనే అతడిని చంపేశారని వాపోతున్నారు. కొట్టి చంపిన తర్వాత చెరువులో పడేశారని అంటున్నారు. 

Updated Date - 2020-08-11T23:40:35+05:30 IST