యువ శాస్త్రవేత్త పవన్కు సీఎం పేషీ నుంచి ఫోన్
ABN , First Publish Date - 2020-04-08T09:43:31+05:30 IST
కరోనా వైర్సను నిర్వీర్యం చేసే పరికరాన్ని తయారు చేసిన యువ శాస్త్రవేత్త పవన్కు సీఎం పేషీ అధికారులు మంగళవారం ఫోన్ చేశారు.
పలమనేరు రూరల్, ఏప్రిల్ 7: కరోనా వైర్సను నిర్వీర్యం చేసే పరికరాన్ని తయారు చేసిన యువ శాస్త్రవేత్త పవన్కు సీఎం పేషీ అధికారులు మంగళవారం ఫోన్ చేశారు. పరికరం పనిచేసే విధానం గురించి పూర్తి వీడియో పంపాలని వారు కోరినట్లు పవన్ తెలిపారు. పవన్ తయారు చేసిన కరోనాను నిర్వీర్యం చేసే పరికరం (బాక్సు) గురించి పత్రికల్లో రావడంతో సీఎం పేషీ అధికారులు స్పందించారు.