పోలీస్ స్టేషన్ ఎదుట యువతి ఆందోళన
ABN , First Publish Date - 2020-06-06T09:54:48+05:30 IST
టెక్కలి ఆదీఆంధ్రా వీధికి చెందిన యర్ర నారాయణరావు తనను ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడని, న్యాయం చేయాలని
టెక్కలి: టెక్కలి ఆదీఆంధ్రా వీధికి చెందిన యర్ర నారాయణరావు తనను ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడని, న్యాయం చేయాలని దాసరి భారతి స్థానిక పోలీస్స్టేషన్ ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టింది. బాధితురాలు, పోలీసుల వివరాల ప్రకారం.. నారాయణరావు, భారతి మూడేళ్లుగా ప్రేమించు కుంటున్నారు. పెళ్లి విషయం ప్రస్తావించేసరికి ఆ యువకుడు ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
తనకు పెళ్లి సంబంధాలు వచ్చినప్పటికీ నారాయణ పెళ్లి చేసుకుంటానని మా టిచ్చాడని, తాము ఎంతో అన్యోన్యంగా ఉండేవారమని, ఇప్పుడేమో తనని కాదంటున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనవద్ద ఫోన్ సంభాషణలు, ఫొటోలు అన్ని ఉన్నాయని, తమ ప్రేమ వ్యవహారం కులపెద్దల సమక్షంలో పెట్టినప్పటికీ పెళ్లికి అంగీకరించలేదని, దీంతో పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. తన తండ్రి అనారోగ్యంతో మృతిచెందడంతో నారాయణ రావు తన పెళ్లికి ఒప్పుకోకుండా పథకం రచించాడని, దీనిపై విచారణ చేసి తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. ఎస్ఐ డి.గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.