విద్యుత్ షాక్ : యువకుడి మృతి
ABN , First Publish Date - 2021-10-17T06:41:43+05:30 IST
బస్సుకు విద్యుత్ వైర్లు తగలడంతో షాక్కు గురై ఓ యువకుడు మృతిచెందాడు. ముగ్గురికి గాయాలయ్యాయి.
కల్లూరు, అక్టోబరు 16: బస్సుకు విద్యుత్ వైర్లు తగలడంతో షాక్కు గురై ఓ యువకుడు మృతిచెందాడు. ముగ్గురికి గాయాలయ్యాయి. కల్లూరు ఎస్ఐ శ్రీనివాస్ కథనం మేరకు.. కడప జిల్లా సంబేపల్లె ఇందిరా నగర్లో కాపురముంటున్న గౌరీశంకర్ పులిచెర్ల మండలం గువ్వలవారిపల్లెలో జరిగిన వివాహానికి పెళ్లి బృందం బస్సులో వచ్చాడు. శుక్రవారం పెళ్లి కాగానే బస్సులో అంతా తిరుగుప్రయాణమయ్యారు. గువ్వలవారిపల్లెకు సమీపంలో బస్సుకు 11కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో షార్ట్ సర్క్యూట్ జరిగింది. డోరు వద్ద నిలుచున్న గౌరీశంకర్ షాక్కు గురై కిందపడిపోయాడు. బస్సులో ఉన్న నరసింహులు(38), రెడ్డెప్ప(34), చరణ్కుమార్(28)కి గాయాలయ్యాయి. పోలీసులు బాధితులను పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గౌరీశంకర్ మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.