ఉద్యోగం కోసం వరంగల్ వెళ్లిన యువకుడి అదృశ్యం
ABN , First Publish Date - 2021-04-19T13:47:49+05:30 IST
ఉద్యోగం కోసం వరంగల్కు వెళ్లిన ఓ యువకుడు అదృశ్యమయ్యాడు.
హైదరాబాద్/అంబర్పేట : ఉద్యోగం కోసం వరంగల్కు వెళ్లిన ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. గోల్నాక కమలానగర్లో విజయలక్ష్మి కుమారుడు సాయికృష్ణ(32) నెల రోజుల క్రితం ఉద్యోగం కోసం వరంగల్కు వెళ్లాడు. పదిహేను రోజుల తర్వాత కృష్ణకు కరోనా వచ్చిందని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన తల్లికి ఫోన్లో సమాచారం వచ్చింది. కొద్దిరోజుల తర్వాత సాయికృష్ణ తిరిగి తన తల్లికి ఫోన్ చేసి తనకు కరోనా తగ్గిందని చెప్పాడు. సాయికృష్ణ అప్పటినుంచి గోల్నాకలోని తన ఇంటికి రాలేదు. ఫోన్ కూడా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో ఆయన తల్లి విజయలక్ష్మి ఆదివారం అంబర్పేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.