పోలీసులతో వాగ్వాదం.. గొంతు కోసుకున్న యువకుడు
ABN , First Publish Date - 2021-07-04T14:58:42+05:30 IST
పోలీసులతో వాగ్వివాదానికి దిగి తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో గొంతు కోసుకున్నాడు...
హైదరాబాద్ సిటీ//కార్వాన్ : మద్యం మత్తులో పోలీసులతో వాగ్వివాదానికి దిగి ఓ యువకుడు బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. ఈ ఘటన ఆసిఫ్నగర్ పోలీస్స్టేషన్లో చోటు చేసుకుంది. మెహిదీపట్నం భోజగుట్టలో హరి(37) భార్య జయంతితో కలిసి నివసిస్తున్నాడు. ఇతడు నిత్యం భార్యతో, ఇతరులతోనూ గొడవలు పడుతూ పోలీస్స్టేషన్కు వస్తుంటాడు. మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలను తీసుకుంటాడు. శనివారం సాయంత్రం 2 గంటల సమయంలో తన సెల్ఫోన్ను దొంగిలించారంటూ పోలీస్స్టేషన్కు హరి భార్య జయంతితో కలిసి వచ్చాడు.
ఫిర్యాదు తీసుకోవడంలో అలసత్వం వహిస్తున్నారంటూ పోలీసులతో వాగ్వివాదానికి దిగి తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. అంతేకాక పోలీస్స్టేషన్ ప్రధాన రహదారిపై నానా హంగామా చేశాడు. పోలీసులు ఎంత నచ్చచెప్పినా ఏమాత్రం వినలేదు. దీంతో అతడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అతడిపై పలు కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మూడు నెలల క్రితం అతడి భార్య జయంతి ఇన్స్పెక్టర్ను దుర్భాషలాడడంతో ఆమెపై కేసు నమోదు చేసి జైలుకు కూడా పంపించారు. ఈ మధ్యే బెయిల్పై వచ్చింది.