ఉద్యోగం పోయిందని యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-05T14:57:37+05:30 IST

ఉద్యోగం పోయిందనే మనోవేదనతో యువకుడు ఉరేసుకుని

ఉద్యోగం పోయిందని యువకుడి ఆత్మహత్య

హైదరాబాద్/పంజాగుట్ట : ఉద్యోగం పోయిందనే మనోవేదనతో యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం పెద్దకొత్తపల్లికి చెందిన కొత్తపల్లి నేతాజీ(27) ఎల్లారెడ్డిగూడ ఇమామ్‌ గూడలో నివాసం ఉంటూ ఓ ప్రైవేట్‌ సంస్థలో సివిల్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఉపాధి కోల్పోయాడు. దీంతో కొంతకాలంగా మానసిక వేదనకు గురికావడమే కాకుండా మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 3వ తేదీన రాత్రి తాను ఉంటున్న గదిలోనే ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్దిసేపటి తర్వాత అతడి సోదరుడు కొత్తపల్లి గాంధీ వచ్చి చూసి వెంటనే ఆస్పత్రికి తరలించాడు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. గాంధీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-12-05T14:57:37+05:30 IST